Samayam Telugu01 Jun, 02:19 pm
చట్టాలంటే జనాలకు భయం లేకుండా పోయిందని, కఠిన శిక్షలు వేయకపోవడం వల్లే ప్రజలు అలవాటుగా మార్చుకుని రోజువారీ నేరాలకు పాల్పడుతున్నారని కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడు (గోపి రెడ్డి కార్తీక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక) బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ కోర్టు పై విధంగా స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు లభించిన హక్కులను ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని జస్టిస్ ఆర్. నటరాజ్ అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అరబ్ దేశాల తరహాలో తప్పు చేసిన వారి కాళ్లు, చేతులు నరికేసే కఠినమైన శిక్షలు ఉంటేనే, ఇక్కడి ప్రజలు చట్టాలను గౌరవిస్తారేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేరస్థులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే చట్టం తన పదునైన కోరలను కోల్పోయింది.. అందుకే పశ్చిమాసియా దేశాలు (అరబ్ దేశాలు) మాదిరిగా కాకుండా ఇక్కడ నేరం చేయడం చాలా సులభం అయిపోయింది.. కాలో లేదా చెయ్యో నరికేస్తేనే బహుశా అప్పుడు చట్టాన్ని పాటించాలనే నిజాన్ని ప్రజలు గ్రహిస్తారు.. మనది ప్రజాస్వామ్యం కావడం వల్ల, ప్రతి ఒక్కరూ దీనిని చాలా తేలికగా తీసుకుంటున్నారు’’ అని జస్టిస్ నటరాజ్ అన్నారు.మణిపాల్ ఎంఐటీ (MIT) విద్యార్థి గోపిరెడ్డి కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం ఆరోపణలపై అతను ఏప్రిల్ 5 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ‘‘ఉప్పు తిన్నప్పుడు నీళ్లు తాగక తప్పదు. మరో నాలుగు ఐదు రోజులు అతడ్ని జైల్లోనే ఉండనివ్వండి. అక్కడి వాతావరణానికి అలవాటు పడనివ్వండి.. ఒకవేళ శిక్ష పడితే మళ్లీ జైలుకే వెళ్లాల్సి వస్తుందని అతడికి తెలుస్తుంది’ అని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అనంతరం ఈ బెయిల్ పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి