translateexpand_more

Best Selling Car In India May News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 12:00 pm
దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కారు ఇదే.. టాప్-10 లో మారుతీ నుంచే ఆరు.. మే లిస్ట్ ఇదిగో

Largest Selling Cars in India: దేశంలో ఒక పక్కన SUV కార్ల హవా నడుస్తుంటే.. సెడాన్ మోడల్స్ కూడా గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇప్పుడు మే నెలలో కార్ సేల్స్ డేటా చూస్తే అది అర్థమవుతోంది. కొంత కాలంగా భారతదేశంలో కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు డేటా విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ కూడా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2026, మే నెలలోనే 2,42,688 యూనిట్ల కార్లను విక్రయించింది. ఒక నెలలో కార్ల విక్రయాల్లో ఇప్పటివరకు ఇదే రికార్డ్. ఇక దేశంలోనే మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. దీని నుంచే మార్కెట్లో ఎక్కువ మోడల్స్, వేరియంట్లు ఉన్నాయని చెప్పొచ్చు. మే నెలలో టాటా మోటార్స్ కార్ల సేల్స్ 59,090 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న కార్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో కార్ల తయారీ కంపెనీలు కార్ల ధరల్ని తగ్గించాయి. ఇంకా అదనపు ఆఫర్లను కూడా ప్రకటించగా.. కార్ల ధరలు భారీగా తగ్గి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి.మరి ఏ కారు బెస్ట్..? ఇదిలా ఉంటే.. కార్లపై జనానికి ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఏ కారు బెస్ట్.. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.. సేఫ్టీ పరంగా ఏది ఉత్తమం.. లుక్ పరంగా ఏది బాగుంటుంది.. ఇలా అన్నీ చూస్తారు. మరి మీకు మీరు కూడా ఈ ప్రశ్న వేసుకునే ఉంటారు. ఇక్కడ కార్ సేల్స్‌ను బట్టి ఇక్కడ ఒక అంచనాకు రావొచ్చు. మరోసారి మారుతీ సుజుకీ డిజైర్ టార్.. మరి దేశంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న కారు ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? ఎందుకుండదు లెండి.. అదే మారుతీ సుజుకీ డిజైర్. మరోసారి ఇదే టాప్‌లో నిలిచింది. 2026 మే నెలకు సంబంధించి కార్ల విక్రయాల్లో ఈ కాంపాక్ట్ సెడాన్ మోడల్ 24,546 యూనిట్ల సేల్స్‌తో టాప్‌లో నిలిచింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో కూడా ఇదే టాప్. దీని ఆన్ రోడ్ ప్రైస్ రూ. 71.5 లక్షల నుంచి రూ. 11.35 లక్షల వరకు ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే టాప్.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తంలోనూ కార్ల విక్రయాల్లో ఇదే టాప్ కావడం విశేషం. 2026 ఏప్రిల్‌లో మారుతీ డిజైర్ సేల్స్ 23,580 యూనిట్లుగా ఉండగా.. మే నెలలో ఇది మరింత పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో చూస్తే ఏకంగా రికార్డు స్థాయిలో 2,29,130 డిజైర్ కార్లను సేల్ చేసింది. అంటే ఇక్కడ ఏప్రిల్, మే నెల సహా గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే టాప్. దీనికి మరొకటి పోటీనే లేదు. టాప్- 10 ఆరు.. టాప్-3 ఇవే.. ఇక మే నెలలో దేశంలోని టాప్ -10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్ చూస్తే.. ఇందులో 6 మోడల్స్ మారుతీ సుజుకీ నుంచే ఉండటం మరో విశేషం. ఇంకా టాప్- 3 స్పాట్స్ కూడా దీనివే. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 20,686 యూనిట్లు, మారుతీ సుజుకీ ఎర్టిగా 20,350 యూనిట్ల సేల్స్‌తో వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి. టాటాల నుంచి రెండు మోడల్స్.. ఇదే సమయంలో టాటా మోటార్స్ నుంచి 2 మోడల్స్ ఉండగా.. టాటా పంచ్ 20208 యూనిట్ల విక్రయాలతో 4, టాటా నెక్సాన్ 19100 యూనిట్ల సేల్స్‌తో ఐదో స్థానంలో ఉన్నాయి. మళ్లీ 6,7,8 స్థానాలు మారుతీ నుంచే బాలెనో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఉన్నాయి. వీటి సేల్స్ ఒక్కోటి 17-18 వేల యూనిట్ల మధ్య ఉన్నాయి. ఆ తర్వాత మహీంద్రా స్కార్పియో (15774 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (15235 యూనిట్లు) ఉన్నాయి.వార్షికంగా 25 శాతం సేల్స్ జంప్.. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం.. కార్ల విక్రయాలు ఎలా పెరిగాయో తెలుసా. గతేడాది మే నెలలో మొత్తం డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 3,51,000 యూనిట్లుగా ఉండగా.. ఇది ఈ ఏడాది మే నాటికి 4,40,000 యూనిట్లుగా నమోదైంది. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన చూస్తే 25 శాతం సేల్స్ పెరిగాయి. మే లో వాహన నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ.. సేల్స్ కూడా భారీ స్థాయిలో పెరగడం గమనార్హం.పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా.. తగ్గని సేల్స్ పెరుగుతున్న క్రూడాయిల్ ధరల నేపథ్యంలో మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై సుమారు రూ. 7.5 శాతం పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. CNG ధరలు కూడా పలుమార్లు పెరగ్గా మే నెలో మొత్తంగా కేజీకి రూ. 6 వరకు పెరిగాయి. ఇలా ధరల భారం, నిర్వహణ ఖర్చులు పెరగడం ఇలా పలు సవాళ్లున్నా..