translateexpand_more

Kharge Latest Decisions News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 03:30 am
షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. కేరళలో విజయం...తమిళనాడు ప్రభుత్వం లో భాగస్వామ్యం.. కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వేళ దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ రష్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు షర్మిల సైతం తాజాగా రాహుల్ తో సమావేశం అయ్యారు. ఇక షర్మిల రాజ్యసభకు వెళ్లటం ఖాయం అనుకుంటున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. పార్టీ తుది నిర్ణయం పైన సస్పెన్స్ కొనసాగుతోంది.దక్షిణాదిన తమ పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ఏపీ మినహా కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా వైఎస్ కుమార్తె.. పీసీసీ చీఫ్ షర్మిలను రాజ్యసభ కు నామినేట్ చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ మేరకు తాజాగా షర్మిల సైతం ఢిల్లీలో రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం వేళ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి ఇప్పటికే రాహుల్ తో పాటుగా ఖర్గే నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో.. రష్మిలకు రాజ్యసభ సీటు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అయింది. కాగా.. కర్ణాటకలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు నిర్ణయం పైన కొంత సస్పెన్స్ కనిపిస్తోంది.AP EAPCET ఫలితాల విడుదల పై బిగ్ అప్డేట్..!!కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం ఏంటి..? షర్మిలను కర్ణాటక కోటాలో రాజ్యసభకు పంపాలని తొలుత భావించారు. అయితే, అక్కడ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం వేళ సిద్దరామయ్య తన మద్దతు దారులకు ప్రాధాన్యత గురించి పట్టు బడుతున్నారు. సిద్దరామయ్య ను ఇప్పటికే సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించారు. కాగా. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌కు దక్కే మూడు రాజ్యసభ సీట్లకు గాను పలుపురి పేర్లు పరిశీలన లోకి వచ్చాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సుప్రియ శ్రీనతే, పవన్ ఖేరా, ఏఐసీసీ కార్యదర్శి బీవీ శ్రీనివాస్‌లు ఉన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని లింగాయత్, ఓబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే చర్చ వినిపిస్తోంది. అందులో భాగంగా బసవరాజు ఏపీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎంఎల్‌సీ బీకే హరిప్రసాద్ (ఓబీసీ), మైసూరు డీసీసీ అధ్యక్షుడు విజయ్ (ఓబీసీ), రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుష్ప అమరనాథ్ (దళిత్), మాజీ ఎమ్మెల్యే అంజలి నింబాల్కర్ (ఓబీసీ), ఏఐసీసీ సెక్రటరీ (కేరళ, లక్షద్వీప్) మన్సూర్ అలి ఉన్నారు. దీంతో.. రష్మిలకు సీటు ఖరారు విషయంలో పార్టీ నాయకత్వం తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ గా మారుతోంది.