translateexpand_more

Richest Chief Minister News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 03:46 pm
దేశంలోనే రిచెస్ట్ సీఎంగా డీకే.. టాప్-3 సౌత్ నుంచే.. ఎవరి ఆస్తులు ఎన్ని కోట్లంటే

DK Shivakumar Net Worth: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ సంక్షోభ సమయాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యూహకర్తగా (ట్రబుల్ షూటర్‌గా) పేరున్న డీకే శివకుమార్ కొత్త ప్రస్థానం మొదలైంది. ఆయన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బుధవారం రోజు (జూన్ 3) ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లాత్.. డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇన్ని రోజులు సిద్ధరామయ్య.. కర్ణాటక సీఎంగా ఉండగా.. ఆయన స్థానంలో డీకే వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటులా పనిచేసి.. ఎట్టకేలకు సీఎం పదవిని అధిరోహించారు. ఎంతో కాలంగా ఈ రోజు కోసం ఎదురుచూడగా.. ఆయన కల ఫలించింది. అయితే డీకే శివకుమార్.. కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఆయన భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. ఇన్ని రోజుల వరకు ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. భారత్‌లో రిచెస్ట్ సీఎంలలో దక్షిణాది నేతలే టాప్- 3 లో ఉండటం మరో విశేషం. మరి ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎన్ని కోట్లు.. టాప్ - 5 లో ఎవరెవరు ఉన్నారు.. వివరాల్ని చూద్దాం.డీకే శివ కుమార్ (కర్ణాటక ముఖ్యమంత్రి) 2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. డీకే శివకుమార్ మొత్తం ఆస్తుల విలువ రూ. 1413 కోట్లు. దీంట్లో వాణిజ్య ఆస్తులు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, పెట్టుబడులు, షేర్లు సహా బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. 2008లో రూ. 75 కోట్లుగానే ఉండగా.. ఈ 18 ఏళ్లలో ఈ స్థాయిలో సంపద పెరగడం విశేషం. ఇక్కడ భూముల విలువ పెరగడం, వ్యాపార ఆస్తుల విలువ పెరగడం, కుటుంబ పెట్టుబడులు పెరగడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్ సీఎం) శివ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు వరకు ఏపీ సీఎం చంద్రబాబు దేశంలో ధనిక సీఎంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన రూ. 931 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన సంపదలో అప్పుడు పెద్ద భాగం హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల ద్వారానే వచ్చింది. ప్రస్తుతం మాత్రం అందులో చంద్రబాబుకు షేర్లు లేవు. చంద్రబాబు కుటుంబానికి వాటా ప్రకారం.. హెరిటేజ్ షేర్లు పెరగడంతో సంపద పెరుగుతూ వచ్చింది. జోసెఫ్ విజయ్ (తమిళనాడు సీఎం) ఇక ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సినీ నటుడు విజయ్.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈయన కూడా దేశంలోని ధనిక సీఎంల జాబితాలో టాప్- 3 లో చోటు సంపాదించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. విజయ్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 648 కోట్లుగా ఉంది. దీంట్లో ఎక్కువగా సినీ రంగంలో వచ్చిన ఆదాయం, స్థిరాస్తులు, పెట్టుబడులు, ఇతర వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్ సీఎం) అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఈయన సంపద ఇటీవలి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూస్తే.. రూ. 332 కోట్లకుపైనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి చూస్తే ఈయనదే టాప్ పొజిషన్. 37 ఏళ్ల వయసులోనే సీఎం పీఠం ఎక్కిన ఈయన.. 2016 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. నెయిఫియు రియో (నాగాలాండ్ ముఖ్యమంత్రి) మరో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో.. దేశంలో ప్రస్తుతం ఐదో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈయన ఆస్తుల విలువ రూ. 46 కోట్లుగా ఉంది. నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఈయన రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా సేవలందించిన వారిలో ఒకరిగా ఉన్నారు. 2003 నుంచి 2014 వరకు.. మళ్లీ 2018 నుంచి ఇంకా సీఎంగా కొనసాగుతున్నారు. ఈయన అత్యధికంగా 5 సార్లు సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. దక్షిణాది నేతల హవా.. ఇక్కడ దేశంలోని ధనిక సీఎంల లిస్ట్ గమనిస్తే.. తొలి 3 స్థానాల్లో ముఖ్యమంత్రులు అందరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం విశేషం. డీకే శివకుమార్ (కర్ణాటక), చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), జోసెఫ్ విజయ్ (తమిళనాడు) వరుసగా టాప్ -3 లో ఉన్నారు. దీంతో రాజకీయంగా సహా ఆర్థికంగా కూడా బలమైన నాయకత్వం సౌత్‌ స్టేట్స్‌లోనే ఉందన్న చర్చ తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి సంపద రూ. 30 కోట్లు.. ఇక టాప్-10 ఒకసారి గమనిస్తే.. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చోటు సంపాదించారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ