translateexpand_more

Telugu Movies News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 12:46 pm
మ రో కొత్త సినిమాతో వ స్తున్న.. సింగ ర్ సునీత తన యుడు

<p>ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం <strong>‘కొత్త మలుపు’</strong> విడుదలకు సిద్ధమైంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.</p><p>ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ వేడుకకు సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు సహా చిత్ర బృందం హాజరైంది.</p><p>గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేమ, సస్పెన్స్‌, వినోదం కలయికగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆకాష్‌, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కోనసీమ అందాలను నేపథ్యంలో చూపిస్తూ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు.</p><p>దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ, రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌ జానర్‌లో సినిమాను తీర్చిదిద్దామని, ఆకాష్–భైరవి జంట తెరపై ఎంతో సహజంగా కనిపించిందని చెప్పారు. కథతో పాటు కామెడీ అంశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని ఆయన పేర్కొన్నారు.</p><p>గాయని సునీత తన కుమారుడు ఆకాష్‌ గురించి మాట్లాడుతూ, అతడు ఎంతో కష్టపడే వ్యక్తి అని, ఈ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి అడుగుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కథతో దర్శకుడు ముందుకొచ్చారని ఆమె అన్నారు.</p><p>సీనియర్ నటుడు భానుచందర్ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, కొత్త తరం నటీనటులు మంచి ప్రదర్శన కనబరిచారని చెప్పారు. చిన్న సినిమాలకు ప్రేక్షకులు ప్రోత్సాహం అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.</p><p>నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, ఇది తన తొలి నిర్మాణ చిత్రం అని, గ్రామీణ నేపథ్యంలో

NTV Telugu28 May, 01:58 am
ఎల్లమ్మ’ కోసం యంగ్ సెన్సేషన్

‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అన్నారు. ఇటీవల మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. ఈ ఎమోషనల్ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారు. దీనిపై ఆమెతో చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు పేరు వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. ఎల్లమ్మలో మమిత ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్‌పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎల్లమ్మ ఎవరు అనేది సస్పెన్స్‌లోనే ఉంది.

AP7AM31 May, 06:37 am
సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

సూపర్ స్టార్, పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయనను ఓ గొప్ప నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా కొనియాడారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు.తెలుగు సినిమాకు నూతన సాంకేతికతను పరిచయం చేయడంలో కృష్ణ ముందున్నారని, ఆయన కృషితోనే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కిందని చంద్రబాబు ప్రశంసించారు. సినీ రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్టు పెట్టారు."తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు" అని సీఎం చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

Telugu Movies News Keyword | Telugu Digital