translateexpand_more

Zhagaram Studios Suriya 48 News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 11:57 am
లోడింగ్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్

Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా ఆ రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హీరో సూర్య తిరుగులేని ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారాయన. ఈ మాస్ కమర్షియల్ సక్సెస్ జోష్‌లో ఉండగానే, సూర్య తన అభిమానులకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వినిపిస్తుంది. తన 48వ ప్రాజెక్ట్ (#Suriya48) కోసం కల్ట్ క్లాసిక్ ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'కరుప్పు' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య, తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' (VAS) చేస్తున్న సంగతి తెలిసిందే, దీని తర్వాత జితు మాధవన్ కాంబోలో తెరకెక్కుతున్న 'సూర్య 47' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా చేస్తున్నారని సమాచారం. ఈ మూడు చిత్రాల తర్వాత సూర్య మళ్లీ తన మార్క్ సోషల్ డ్రామా వైపు అడుగులు వేస్తున్నారని ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ ఓటీటీ వేదికగా విడుదలై, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించడమే కాకుండా న్యాయవ్యవస్థపై బలమైన ఇంపాక్ట్ చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబో తెరకెక్కబోతున్నట్లు జరుగుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక పవర్‌ఫుల్ రియల్ లైఫ్