
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి, రోగికి ప్రత్యేకమైన చికిత్స అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక 'లిక్విడ్ బయాప్సీ' పరీక్షలను త్వరలోనే రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రకటించారు. కేవలం రక్త నమూనా ద్వారానే క్యాన్సర్ దశ, దాని తీవ్రతను గుర్తించే ఈ విప్లవాత్మక సేవలను ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా అందించనుండటం క్యాన్సర్ రోగులకు పెను ఊరటనిచ్చే అంశం.సాధారణంగా క్యాన్సర్ నిర్ధారణకు కణితి నుంచి కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసి 'టిష్యూ బయాప్సీ' చేస్తారు. ఇది రోగికి కొంత బాధ కలిగించే ప్రక్రియ. దీనికి భిన్నంగా, లిక్విడ్ బయాప్సీ విధానంలో కేవలం ఒక రక్తపు చుక్కతోనే శరీరంలో వ్యాపించిన క్యాన్సర్ కణాల డీఎన్ఏను విశ్లేషించి వ్యాధి తీవ్రతను గుర్తిస్తారని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతవీర్ జి. ఉప్పిన్ వివరించారు. దీనివల్ల రోగికి ఎలాంటి కోత, శస్త్రచికిత్స అవసరం ఉండదు.ఇప్పటికే నిమ్స్లోని క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్లో 'నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్' (ఎన్జీఎస్) టెక్నాలజీతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ 'డైమండ్ ప్రాజెక్టు'లో భాగంగా ఈ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను గుర్తించి, రోగి శరీరతత్వానికి అనుగుణంగా 'టార్గెటెడ్ థెరపీ' అందించడానికి ఈ పరీక్షలు కీలకం. 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 1,443 మంది రోగులకు ఈ ఖరీదైన జన్యు పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించి, వారికి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి, రోగికి ప్రత్యేకమైన చికిత్స...