
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలలో పాకిస్థాన్ను ప్రతికూలంగా చూపించారని కొందరు విమర్శిస్తున్న నేపథ్యంలో, అందులో చూపించిన ప్రతీ అంశం వాస్తవమేనని ఆరిఫ్ అజాకియా అనే పాక్ జర్నలిస్ట్ స్పష్టం చేశారు. అంతేకాదు, తాను పాకిస్థానీని కాదని, భారత మూలాలున్న వ్యక్తినని ప్రకటించి సంచలనం రేపారు.గతేడాది డిసెంబర్లో ‘ధురంధర్’, ఈ ఏడాది మార్చిలో దానికి సీక్వెల్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 3100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లోని కరాచీ నగరానికి చెందిన ల్యారీ ప్రాంతంలోని నేర సామ్రాజ్యాలు, వాటిపై భారత నిఘా వర్గాలు జరిపిన కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్ల ఆధారంగా ఈ చిత్రాలను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాలు పాకిస్థాన్కు వ్యతిరేకంగా రాజకీయ అజెండాతో రూపొందించారని కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆరిఫ్ అజాకియా ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల జరిగిన ‘టాక్ జర్నలిజం 2026’ కార్యక్రమంలో జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదితో మాట్లాడుతూ ఆరిఫ్ అజాకియా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ పంచుకుంది. "సినిమాలో చూపించిన ల్యారీ ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. ఆ కాలంలో కరాచీలోని ఒక పట్టణానికి మేయర్గా కూడా పనిచేశాను. కాబట్టి, ‘ధురంధర్’ చిత్రంలో చూపించిన ప్రతి విషయం నిజమని, అక్కడి పరిస్థితులను నేను బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర...