
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో సుమారు 190 పరుగులు చేసి ఉంటే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లమని, అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ అనంతరం అతడు మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు."పిచ్ మరీ నెమ్మదిగా ఏమీ లేదు. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా సహకరించింది. అయితే, మేం తొలి ఓవర్లలోనే వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో వేగం పెంచలేకపోయాం, దాంతో మా ఇన్నింగ్స్ గాడి తప్పింది" అని గిల్ వివరించాడు. 150-160 పరుగులు చేసినప్పటికీ, పవర్ప్లేలో కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్లోకి రావొచ్చని బలంగా నమ్మినట్లు తెలిపాడు."ఛేజింగ్లో పవర్ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు అదనంగా చేసింది. వారిని 50-55 పరుగులకే కట్టడి చేసి ఉంటే మాకు గెలుపు అవకాశం ఉండేది. కానీ వాళ్లు అక్కడ దూకుడుగా ఆడి మా నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు" అని గిల్ పేర్కొన్నాడు.అయితే, ఫైనల్లో ఓడినప్పటికీ ఈ సీజన్లో జట్టు ప్రదర్శనపై గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. "తొలి రెండు మ్యాచ్లు ఓడినా ఆ తర్వాత మేం పుంజుకున్న తీరు అద్భుతం. ఈ టోర్నమెంట్లో మాది అత్యుత్తమ బౌలింగ్ విభాగం. కప్ గెలవకపోయినా మా ప్రయాణంపై సంతోషంగా ఉన్నాం. ఒకవేళ ట్రోఫీ గెలిచినా కూడా, మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని మాకు తెలుసు" అంటూ గిల్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో సుమారు 190 పరుగులు చేసి ఉంటే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లమని, అప్పుడు మ్యాచ్...