
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనంతరం పటీదార్ భావోద్వేగంగా మాట్లాడాడు. ఈ అనుభూతి అద్భుతంగా ఉందని, తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని తెలిపాడు. గతేడాది జ్ఞాపకాలు మదిలో కదలాడాయని, ఈసారి విజయం సాధించడం చాలా సంతోషాన్నిస్తోందని అన్నాడు."టాస్ గెలిచినప్పుడు ఛేజింగ్ చేయడం సులువవుతుందని స్పష్టమైన ప్లానింగ్తో ఉన్నాం. మా బౌలర్లు భువీ, హేజిల్వుడ్, రసిఖ్, కేపీ సుయాశ్, షెఫర్డ్ టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి వల్లే ఈ విజయం సాధ్యమైంది" అని పాటిదార్ జట్టును ప్రశంసించాడు.తన వ్యక్తిగత ప్రస్థానం గురించి మాట్లాడుతూ, "నేను ఆర్సీబీకి కెప్టెన్ అవుతానని, ట్రోఫీని గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. బహుశా ఇదంతా నా విధిలో రాసిపెట్టి ఉంది. అందుకు నేను కృతజ్ఞుడిని" అని అన్నాడు. గతేడాది కంటే ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగామని, అభిమానుల మద్దతుతో ప్రతిచోటా తమకు హోమ్ గ్రౌండ్ లాగే అనిపించిందని తెలిపాడు. టోర్నమెంట్కు ముందు తాను బాగా సిద్ధమయ్యానని, డీకే (దినేశ్ కార్తీక్) ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ జట్టుకు అండగా ఉంటారని కొనియాడాడు.చివరగా, "ఈ విజయం మరోసారి మీకే, ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ సాలా ను కప్ నమ్దు," అంటూ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనంతరం పటీదార్ భావోద్వేగంగా మాట్లాడాడు. ఈ అనుభూతి...