
ప్రపంచ వాణిజ్యంలో ఇరాన్కు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో, హిందూ మహాసముద్రంలో మలక్కా జలసంధి కూడా అంతే వ్యూహాత్మకమైనది. ఇప్పుడు ఆ జలసంధిపై పట్టు సాధించి, ఇండో-పసిఫిక్లో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఓ భారీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దీవిలో సుమారు 9 నుంచి 11 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో మెగా అభివృద్ధి ప్రాజెక్టును వేగవంతం చేసింది.భారత ప్రధాన భూభాగానికి 1,600 కిలోమీటర్ల దూరంలో, మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న ఈ దీవిలో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, సైనిక-పౌర అవసరాలకు ఉపయోగపడే విమానాశ్రయం, విద్యుత్ కేంద్రం, భారీ టౌన్షిప్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు, చైనా ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 80 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భారత ఉనికిని బలోపేతం చేయడం ద్వారా సముద్ర వాణిజ్య మార్గాలపై నిఘా పెట్టవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యర్థుల కదలికలను సులభంగా పర్యవేక్షించవచ్చని భారత నౌకాదళ మాజీ వైస్ చీఫ్ శేఖర్ సిన్హా వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్ జజీరా కథనం ప్రకారం, ఈ ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. దీంతో నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి.అయితే, ఈ భారీ ప్రాజెక్టుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన షోంపేన్, నికోబరేస్ ఆదివాసీ తెగలు నివసించే ఈ ప్రపంచ వాణిజ్యంలో ఇరాన్కు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో, హిందూ మహాసముద్రంలో మలక్కా జలసంధి కూడా అంతే వ్యూహాత్మకమైనది. ఇప్పుడు ఆ జలసంధిపై పట్టు సాధించి, ఇండో-పసిఫిక్లో చైనాకు చెక్...