
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే డీకే శివకుమార్ కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వరాల జల్లు కురిపించారు. ఇవాళ (జూన్ 3న) బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్లో పార్టీ నేతలు, మత పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అధికారంలోకి వస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని తొలి కీలక ప్రకటన చేసి విద్యార్థులకు శుభవార్త అందించారు.గతంలో ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో డీకే శివకుమార్ 'బ్రాండ్ బెంగళూరు' నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో దీర్ఘకాలంగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ప్రకటించిన ప్రధాన హామీలు, పథకాలు ఈ విధంగా ఉన్నాయి:ఉచిత బస్ పాసులు: రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ ఉద్యోగాలు: జాబ్ కాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. సుమారు 50,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనిపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.ప్రైవేట్ ఉపాధి: కర్ణాటక యువతకు ప్రాధాన్యతనిస్తూ నైపుణ్య శిక్షణతో కూడిన ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.యువక సంఘాలు: క్రీడలు, సంస్కృతి, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,000 'భారత్ జోడో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే డీకే శివకుమార్ కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన...