
ఇంటర్నెట్ డెస్క్: అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు సృష్టించింది. గుజరాత్లోని ఖవ్డాలో 3.37 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ను (Adani green energy) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీంతో చైనా వెలుపల ఒకే చోట నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్గా ఇది నిలిచింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈ భారీ ప్రాజెక్టును కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయడం విశేషం. ఇందులో భాగంగా 1.37 గిగావాట్ అవర్ కెపాసిటీని మార్చిలోనే కంపెనీ ప్రారంభించింది. మిగిలిన సామర్థ్యాన్ని జోడించి మొత్తం 3.37 గిగావాట్ అవర్ కెపాసిటీకి చేర్చింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు రోజంతా సరిపడా విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. సౌర, పవన వ్యవస్థల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు వాడుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ ఇంధన రంగానికి స్వావలంబన, సుస్థిరత లభిస్తుందని దీనివల్ల నాణ్యమైన, అందుబాటు ధరలో విద్యుత్ లభిస్తుందని వెల్లడించారు. విద్యుత్ను నిల్వ చేసేందుకు అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలను అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.