
Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. అంతే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 1000 కోట్ల కుంభకోణంకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. ఈ కుంభకోణం వెనుక రేవంత్ రెడ్డి, అతని ముఖ్య అనుచరుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారన్నారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.