
హైదరాబాద్: పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకే పింఛన్లు అందివ్వాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందాలన్నారు. ఆ సిబ్బంది వేతనాల కోసం నెలకు రూ.50 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ‘‘ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోను. పంచాయతీల ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా బ్యాంకులో జమ చేయాలి. దీనికోసం చట్టసవరణ చేయాలి. పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసేలా ఓటర్ ఐడీ, ఆధార్, ఎస్ఈఈపీసీ డేటా ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేయాలి. కొత్తగా అందించే పింఛన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.