
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Nara Chandrababu Naidu Speech: తెలుగుదేశం పార్టీ నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వేదికగా వర్చువల్ విధానంలో 'మహానాడు' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్వహించింది. 'మహానాడు' సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేవలం ఎన్నికల కోసం కాకుండా, భవిష్యత్ తరాల (జెన్ జీ, జెన్ ఆల్ఫా) ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ మహానాడును ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు అంకితం ఇస్తూ 'మహిళా మహానాడు'గా ప్రకటించారు. గత విధ్వంసం - రెండేళ్ల సుపరిపాలన.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే గట్టెక్కించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించామని చెప్పారు. అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ భారాలు లేకుండా చూశామని తెలిపారు. మహిళా సాధికారత, సంక్షేమం.. మహిళల ఆస్తి హక్కు నుండి నేటి 'తల్లికి వందనం' వరకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 కింద ఉచిత మహిళా సాధికారత, సంక్షేమం.. మహిళల ఆస్తి హక్కు నుండి నేటి 'తల్లికి వందనం' వరకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' బ్రాండింగ్ కల్పిస్తున్నామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో రూ.63 వేల కోట్లకు పైగా సామాజిక పింఛన్లు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించామని, 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు రూ.14 వేలు అందిస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నుండి 'సంజీవని' డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం తెస్తున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల వరద.. రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమం చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఏపీకి వస్తోందని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 పోస్టులు భర్తీ చేయడంతో పాటు, 10 వేల పోస్టులతో కూడిన '2026 జాబ్ క్యాలెండర్' విడుదల చేశామన్నారు. ప్రాజెక్టుల పురోగతి.. గత పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ను రూ.1,000 కోట్లతో నిర్మించామని, పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ సాధించామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రతిపక్షంపై విమర్శలు, కేడర్కు పిలుపు.. వైసీపీని 'గొడ్డలి పార్టీ', 'ఫేక్ న్యూస్ బ్యాచ్'గా అభివర్ణించిన సీఎం చంద్రబాబు.. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను రాయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశంలోనే బలమైన కేడర్ టీడీపీ సొంతమన్న ఆయన, కార్యకర్తల ఆరోగ్యం కోసం 'మై హెల్త్ యాప్' తెచ్చామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ 2024 విజయాలను పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు. Also Read: విశాఖలో దారుణం.. చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా భార్తను చంపేసిన భార్య Also REad: Pawan Kalyan Nageshwar: "ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వద్దు" ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook