
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Andhra Pradesh Government Releases Rs 258 Cr Fee Reimbursement: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 258 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులను నేరుగా ఆయా కాలేజీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో అనేక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థల ఆర్థిక నిర్వహణను సులభతరం చేసేందుకు గాను.. నేరుగా కాలేజీల అకౌంట్లలోనే ఈ నిధులను జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తుంది. గత బకాయిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉండగా.. ఏపీ ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీని గురించి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదల ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఒకేసారి దాదాపు రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా విడుదల చేసిన రూ. గత బకాయిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉండగా.. ఏపీ ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీని గురించి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదల ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఒకేసారి దాదాపు రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా విడుదల చేసిన రూ. 258 కోట్లు కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థుల ఫీజుల కోసమేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిధుల విడుదలతో గత కొన్నాళ్లుగా ఫీజులు బకాయిలు ఉండటంతో.. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ తాజాగా సర్కార్ నిధులు విడుదల చేయడంతో వారికి ఊరట లభించనుంది. ఇదిలా ఉంటే ఏపీలో.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో అకౌంట్లలో పడాలంటే విద్యార్థులు కచ్చితంగా 75 శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ కలిగి ఉండాలి. అలానే జ్ఞానభూమి పోర్టల్లో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బకాయిలన్నింటినీ త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. Also Read: Vaibhav Sooryavanshi: చిన్నోడే కానీ చిచ్చరపిడుగు.. ఒక్క తుఫాన్ ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ రికార్డుల దండయాత్ర! Also Read: Silver Rate Today: బక్రీద్ వేళ తగ్గిన వెండి ధర.. నేడు మే 28వ తేదీ గురువారం ధరలివే..!! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి