
Rayadurgam Land Auction: హైదరాబాద్ లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. రాయదుర్గంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. ఇది దక్షిణ భారత దేశంలోనే అల్ టైమ్ రికార్డ్. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టిజిఐఐసి (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) భూముల వేలం వేసింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఒక ఎకరం ఏకంగా రూ.237 కోట్లు పలికి రికార్డ్ సృష్టించింది. టిజిఐఐసి నిర్ణయించిన కనీస ధర 139 కోట్ల రూపాయలు కాగా వేలం ముగిసే సమయానికి అది దాదాపు 237 కోట్లకు చేరింది. ఇక 2025 డిసెంబర్ లో రాయదుర్గంలోని 7.67 ఎకరాల భూమి వేలంలో రికార్డ్ ధర పలికింది. ఎకరం 177 కోట్లు ధర పలికింది. 7 ఎకరాలకు మొత్తం 1357.59 కోట్లు ఆదాయం ఆర్జించింది టిజిఐఐసి. Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ ‘ఆల్ ఇన్ వన్’ కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్