
ఇంటర్నెట్ డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లు బాది 97 పరుగులు చేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్తో ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (59) పేరిట ఉన్న రికార్డును వైభవ్ (65) బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ కామెంటెటరీ చేశారు. వీరి మధ్య వైభవ్ టాపిక్ వచ్చింది. ఒకవేళ సూర్యవంశీ వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తారని సెహ్వాగ్ని హర్భజన్ అడిగాడు. సెహ్వాగ్ ఏ మాత్రం ఆలోచించకుండా తాను రూ.30 కోట్లు చెల్లిస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వైభవ్పై ప్రశంసలు కురిపించారు. అతనిలో ‘స్పెషల్ టాలెంట్’ ఉందని.. ఈ కుర్రాడు మరింత రాటుదేలడానికి బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మార్గదర్శకత్వం అందిస్తాయని పేర్కొన్నారు. ‘‘వైభవ్ టెంపర్మెంట్ ఇలానే కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని బీసీసీఐ, రాజస్థాన్ ఫ్రాంఛైజీ అందిస్తాయి. క్రీడల్లో కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢత్వం అవసరం. అతను రాబోయే మరెన్నో సంవత్సరాలపాటు టీమ్ఇండియా తరపున రాణించేలా చూడటంలో మా వంతు కృషిని మేం తప్పకకుండా చేస్తాం’’ అని అరుణ్ ధుమాల్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.