
జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PEDDI Telangana Exhibitors News: 'పెద్ది' రిలీజ్కు ముందు నిర్మాతలకు మరో షాక్ తగలనుంది. నిన్న, మొన్నటి వరకు తెలంగాణలోని థియేటర్ ఓనర్లు పర్సంటేజ్ కావాలని పట్టుబట్టారు. అయితే చర్చలు సఫలం అయ్యాక ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో 'పర్సంటేజ్' (శాతాల) విధానం ప్రకారమే సినిమాలు ఆడిస్తామని, ప్రస్తుతం ఉన్న 'రెంటల్' (అద్దె) విధానాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎగ్జిబిటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రామ్చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం 'పెద్ది'కి కూడా ఇదే నిర్ణయం అమలు అవుతుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ, నిర్మాతల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల సమయంలోనే మా సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కానీ, ఏడాది దాటినా ఎలాంటి ముందడుగు పడలేదు. నిర్మాతలు కావాలనే సమయాన్ని వాయిదా వేస్తున్నారు. దాదాపు 120 మంది థియేటర్ల యజమానులు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నారు. 10, 15 ఏళ్ల క్రితం థియేటర్లకు మంచి ఆదాయం ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్ వంటి దాదాపు 14 రకాలుగా ఆదాయం వస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లలో పర్సంటేజ్ విధానమే నడుస్తుంటే, ఇక్కడ మాత్రం పాత అద్దె పద్ధతినే రుద్దుతున్నారు. థియేటర్ల ఏసీ, సౌండ్ సిస్టమ్ను బట్టి కాకుండా.. అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే గ్రేడింగ్ చేయాలని, దానికి తాము సిద్ధమని ప్రకటించారు. అయితే ఇదే సమావేశంలో తెలంగాణ థియేటర్ ఓనర్లు ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపు ఉండే అవకాశం ఉందని.. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి పెంపుదల వద్దని సీఎం రేవంత్ రెడ్డికి, ఫిల్మ్ ఛాంబర్కు లేఖ రాశామని వారు తెలిపారు. సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచి ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేయోద్దని వారు కోరారు. ఈ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదు. మొదట 'పెద్ది' సినిమాని ఈ గొడవ నుంచి మినహాయించాలనుకున్నాం. కానీ ఈ సినిమాను వదిలేస్తే, ఆ తర్వాత మా సమస్యను ఎవరూ పట్టించుకోరనే భయంతోనే దీన్ని కూడా పర్సంటేజ్ శ్లాబ్లోకి తెచ్చాం. అవసరమైతే ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలోనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ను ఎన్నుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్ల తాజా నిర్ణయంతో నైజాం (తెలంగాణ) ఏరియాలో 'పెద్ది' సినిమా విడుదల, టికెట్ రేట్ల పెంపుపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. Also Read: అనిరుధ్తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది! Also Read; 'పెద్ది' కోసం భోపాల్లో బిగ్గెస్ట్ ఈవెంట్..శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ రిలీజ్ కూడా అప్పుడే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Summary status: pending