
Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే లక్షద్వీప్లోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లు పలకరించే అవకాశాలు కనిపస్తున్నాయి.