
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) దిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన భారత్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం (Iran consulate) అమెరికా మంత్రికి చురకలు అంటిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) దిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన భారత్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం (Iran consulate) అమెరికా మంత్రికి చురకలు అంటిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. భారతీయులలో సభ్యత కన్పిస్తుందని.. వారి నుంచి కొంచెమైనా దానిని నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. యుద్ధం ముగింపు చర్చలు కొనసాగుతున్న క్రమంలో అగ్రరాజ్యానికి చెందిన కొందరు నేతలు ఇరాన్తో ప్రవర్తిస్తున్న తీరు నేపథ్యంలో ఆ దేశ కాన్సులేట్ ఈ పోస్టు చేయడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా తొలుత కోల్కతా చేరుకున్న అమెరికా మంత్రి మార్కో రూబియో అక్కడ మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించారు. అనంతరం దిల్లీలోని ‘సేవా తీర్థ్’లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్తో ఆదివారం విస్తృత చర్చలు జరపనున్నారు. మంగళవారం దిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో భేటీ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending