
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల ట్రయల్స్ (2026)లో పోటీపడే విషయంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె సెలక్షన్ ట్రయల్స్లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను (Vinesh Phogat) వెనక్కి రమ్మని చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. మే 30, 31వ తేదీల్లో జరిగే సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ ఫొగాట్ పోటీ పడేందుకు అనుమతినిస్తూ ఇటీవల దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. దీన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తన పరిధిని మీరిందని, ఎంపిక ప్రమాణాల ప్రకారం వినేశ్ అనర్హురాలైనా.. ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు డబ్ల్యూఎఫ్ఐ తమ స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ‘‘ఈ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ ఆమె (వినేశ్) ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైన నిర్ణయమనిపించుకోదు. ప్రస్తుతానికి ఈ విషయంలో మేం ఏం చేయలేం. ఆమె పోటీల్లో పాల్గొనవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్పై వినేశ్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ విషయంలో దిల్లీ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టుల వేగవంతమైన జోక్యం సరికాదని అభిప్రాయపడింది. ‘‘ఆమె అద్భుతమైన రెజ్లర్ కావొచ్చు. కానీ, కోర్టులకు ఈ విషయంలో దిల్లీ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టుల వేగవంతమైన జోక్యం సరికాదని అభిప్రాయపడింది. ‘‘ఆమె అద్భుతమైన రెజ్లర్ కావొచ్చు. కానీ, కోర్టులకు దేశమే ప్రథమ ప్రాధాన్యం. ఇదేమీ కాలేజీ అడ్మిషన్ కాదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన అంశం. కోర్టులు మొత్తం క్రీడా షెడ్యూల్కు అంతరాయం కలిగించకూడదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.