
Telangana:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల కోసం రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు ఆర్థిక ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.