
దేశీయ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం సరికొత్త సంచలన ప్లాన్ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో “జియో ఓటీటీ పాస్” పేరుతో ఒకే ప్యాక్లో కళ్ళు చెదిరే ప్రయోజనాలను ప్రకటించింది. ఈ సరికొత్త ప్యాక్ ద్వారా వినియోగదారులు 15 ప్రముఖ ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్లతో పాటు, 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. సుమారు రూ. 1,500 విలువైన ఈ సేవలను జియో అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ ప్యాక్లో యూట్యూబ్ ప్రీమియం , జియోహాట్స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. వీటితో పాటు సోనీలివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, సన్ నెక్స్ట్ వంటి మరో 12 ఓటీటీల కంటెంట్ను జియోటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు. అంతేకాకుండా, స్టార్ ప్లస్, కలర్స్, సన్ టీవీ వంటి 150 కి పైగా పెయిడ్ ఛానెళ్లతో కలిపి మొత్తం 1,000 లైవ్ టీవీ ఛానెళ్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కనెక్టివిటీ పరంగా ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న ఏ జియో కస్టమరైనా మైజియో యాప్ లేదా జియో వెబ్సైట్ ద్వారా ఈ సూపర్ ఓటీటీ పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక ఈ రెండు By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy. ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం! దేశీయ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం సరికొత్త సంచలన ప్లాన్ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో “జియో ఓటీటీ పాస్” పేరుతో ఒకే ప్యాక్లో కళ్ళు...