
తమిళనాడులోని కుంభకోణం భారతదేశపు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటి. వేలాది ఆలయాలకు ఇది నిలయం. ఈ ప్రాంతంలో ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం దర్శనమిస్తుంటుంది. అటువంటి పుణ్యక్షేత్రాల మధ్య, కుంభకోణానికి సమీపంలో, పవిత్ర కావేరి నది తీరాన తిరుందుదేవన్గుడి కర్కటేశ్వర స్వామి ఆలయం (Thirundudevankudi Temple) వెలసింది. ఆలయంలో పరమేశ్వరుడు కర్కటేశ్వర స్వామిగా కొలువై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ క్షేత్రాన్ని స్థానికులు "నండు కోవిల్" అని కూడా పిలుస్తారు. స్వామికి అభిషేకం చేసిన నువ్వుల నూనెను ప్రసాదంగా అందిస్తారు. ఆ నూనెను భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం, ఒకసారి దుర్వాస మహర్షి శివారాధనలో ఉండగా ఓ గంధర్వుడు ఆయన నడకను పరిహసించాడు. దాంతో ఆగ్రహించిన మహర్షి అతడిని పీతగా జన్మించమని శపించాడు. తన తప్పును గ్రహించిన గంధర్వుడు క్షమాపణ కోరగా, శివారాధన ద్వారా శాప విమోచనం పొందవచ్చని మహర్షి సూచించాడు. దీంతో గంధర్వుడు పీత రూపంలో శివుని నిరంతరం ఆరాధించాడు. మరో పురాణ గాథ ప్రకారం, దేవేంద్రుడు ప్రతిరోజూ 1008 కమలాలతో శివార్చన చేసేవాడని కథనం. ఒకరోజు కమలాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించి వెతకగా, అప్పుడు పీత ఒక కమలాన్ని తీసుకుని శివునికి సమర్పిస్తున్న దృశ్యం ఇంద్రునికి కనిపించింది. కోపంతో ఇంద్రుడు వెంటనే తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. పీత అప్పుడు శివలింగంలోని ఒక రంధ్రంలో దాక్కుంది. వజ్రాయుధం శివలింగాన్ని తాకగా, దానిపై ఒక గుర్తు ఏర్పడింది. తన తప్పును గ్రహించిన ఇంద్రుడు శివుని క్షమాపణ కోరగా, శివుడు ప్రత్యక్షమై అతడిని అనుగ్రహించాడు. అలాగే, పీతకు మళ్లీ గంధర్వ రూపాన్ని ప్రసాదించాడు. పీతను సంస్కృతంలో "కర్కట" అనడంతో ఈ శివుడు కర్కటేశ్వరుడిగా పీత అప్పుడు శివలింగంలోని ఒక రంధ్రంలో దాక్కుంది. వజ్రాయుధం శివలింగాన్ని తాకగా, దానిపై ఒక గుర్తు ఏర్పడింది. తన తప్పును గ్రహించిన ఇంద్రుడు శివుని క్షమాపణ కోరగా, శివుడు ప్రత్యక్షమై అతడిని అనుగ్రహించాడు. అలాగే, పీతకు మళ్లీ గంధర్వ రూపాన్ని ప్రసాదించాడు. పీతను సంస్కృతంలో "కర్కట" అనడంతో ఈ శివుడు కర్కటేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. చోళుల పాలనలో, ఒక చోళరాజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ, ఎన్నో వైద్య ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. నిస్సహాయుడైన ఆయన చివరకు పరమేశ్వరుడిని ప్రార్థించగా, పురాణాల ప్రకారం శివపార్వతులు మానవ రూపంలో ప్రత్యక్షమై పవిత్ర విభూతిని అందించారు. ఆ విభూతిని ధరించిన వెంటనే రాజు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. దైవ దర్శనం అదృశ్యమవగా, భక్తిపూర్వకంగా వారి జాడ కోసం వెతికిన రాజుకు శివుడి ఆదేశం వినిపించింది. పీత శివారాధన చేసిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని శివుడు ఆజ్ఞాపించగా, చోళరాజు అక్కడే ఈ మహా క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో స్వామి కర్కటేశ్వరుడిగా, అమ్మవారు అపూర్వనాయకి అమ్మన్గా భక్తులకు దర్శనమిస్తారు. శివలింగంపై ఇంద్రుడి ఆయుధం తాకిన గుర్తు, పీత దాగిన రంధ్రం ఇప్పటికీ దర్శనమిస్తాయని స్థానికులు చెబుతారు. ఇవి ఆలయ చరిత్రకు, విశ్వాసాలకు ప్రత్యక్ష నిదర్శనాలు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన కర్కాటక రాశి వారికి ఈ క్షేత్రం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. ఆరోగ్యం, మానసిక శాంతి, పాప పరిహారం వంటి వాటి కోసం అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. తిరుందుదేవన్గుడి క్షేత్రం కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణం నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు; రైలు, బస్సు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మికత, పురాణ గాథలు, భక్తుల విశ్వాసాలతో ఈ కర్కటేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని విశిష్ట శైవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తమిళనాడులోని కుంభకోణం భారతదేశపు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటి. వేలాది ఆలయాలకు ఇది నిలయం. ఈ ప్రాంతంలో ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం దర్శనమిస్తుంటుంది. అటువంటి పుణ్యక్షేత్రాల...