
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించిన ఈ సీజన్లో తమ పటిష్ఠమైన బౌలింగ్ ప్రదర్శనలతో రెండు జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్లో ఇరు జట్ల పేస్ బౌలింగ్ దళాల మధ్య జరిగే పోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.ఈ ఫైనల్ కేవలం టైటిల్ పోరు మాత్రమే కాదు, పర్పుల్ క్యాప్ కోసం ఇద్దరు స్టార్ పేసర్ల మధ్య జరిగే ఆసక్తికర సమరం కూడా. ప్రస్తుతం 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బౌలర్ కగిసో రబడా, 26 వికెట్లతో అతడి వెనుకే ఉన్న ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ మధ్య ఈ పోటీ నెలకొంది. అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో ఈ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. బ్యాటర్లకు స్వర్గధామంగా మారిన ఈ సీజన్లో బౌలింగ్నే నమ్ముకుని ఫైనల్ చేరడం ఈ రెండు జట్ల ప్రత్యేకత.గుజరాత్ టైటాన్స్ జట్టులో అనుభవం, యువత కలగలిసిన పటిష్ఠమైన పేస్ దళం ఉంది. కగిసో రబడా (రూ. 10.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (రూ. 12.25 కోట్లు), ప్రసిధ్ కృష్ణ (రూ. 9.5 కోట్లు) వంటి స్టార్లతో పాటు ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు) జట్టుకు అదనపు బలం. ఈ సీజన్లో సిరాజ్ 18, హోల్డర్ 17 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించిన ఈ సీజన్లో తమ పటిష్ఠమైన బౌలింగ్ ప్రదర్శనలతో రెండు జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. అహ్మదాబాద్లోని...