translateexpand_more

Rajya Sabha Elections News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 12:33 pm
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. 'ఆమె'కు అవకాశం ఇస్తారా

ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ సీట్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూన్ 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జూన్ 18న ఎన్నికల జరగనుండగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. జూన్ 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీటు కోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన వారు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు నేతలు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు అవకాశం ఉంటుందా?మరోవైపు ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వే్ చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ఈ రాజ్యసభ ఎన్నికల నుంచే అమలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే

AP7AM01 Jun, 01:30 pm
ఏపీలో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, మూడు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8 చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.ఇక శాసనమండలి ఎన్నికల విషయానికొస్తే, బీహార్‌లో 9, కర్ణాటకలో 7 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బీహార్‌లో నితీశ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.