
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్లలో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజా విజయంతో కృణాల్ పాండ్యా ఖాతాలో ఐదో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. గతంలో అతను ముంబై ఇండియన్స్ తరపున మూడు సార్లు (2017, 2019, 2020) టైటిల్స్ గెలవగా, ఇప్పుడు ఆర్సీబీ తరపున రెండు సార్లు (2025, 2026) కప్లు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సరదా కామెంట్.. ఆర్సీబీ విజయ సంబరాల్లో కృణాల్ పాండ్యా తన ఐదు వేళ్లను చూపిస్తూ, తాను ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచానని సైగ చేశాడు. పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ దీనిని గమనించి, కృనాల్ను సరదాగా ఆటపట్టించాడు. ‘నువ్వు ఇప్పుడు పక్కా ఆర్సీబీ ఆటగాడివి.. కాబట్టి ఆ ఐదు వేళ్లు పక్కన పెట్టి, ఆర్సీబీ తరపున గెలిచిన రెండు టైటిళ్లను మాత్రమే చూపించు’ అంటూ విరాట్ కోహ్లీ కాస్త నువ్వుతూనే కోపంగా అన్నాడు. కోహ్లీ మాటలకు కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ నవ్వులు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు, ట్రోఫీ పక్కన కూర్చోవడానికి జితేశ్ శర్మ కేవలం విరాట్ కోహ్లీ కోసమే వెతకడం ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య ఉన్న బాండింగ్ను చూపిస్తోంది. కృనాల్ పాండ్యా ఏమన్నాడంటే? ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంపై కృనాల్ పాండ్యా జియోహాట్స్టార్తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ‘క్రికెట్లో ట్రోఫీలు గెలవడమే నాకు అన్నిటికంటే పెద్ద ప్రేరణ. ఛాంపియన్షిప్ కప్ను చేతిలోకి తీసుకోవడంలో ఉండే కిక్కే వేరు.’ ‘వ్యక్తిగత ప్రదర్శనలు, మ్యాచ్లు గెలవడం ఆనందాన్ని