
Asianet News Telugu01 Jun, 12:44 pm
నేపాల్ పశుపతినాథ్ నుండి శ్రీశైలం మల్లన్న వరకు.. రూ.15 వేలకే ఐఆర్సిటిసి సూపర్ టూర్ ప్లాన్తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు చుట్టిరావాలనుకునే భక్తులకు ఇది గుడ్ న్యూస్. భారతీయ రైల్వే టూరిజం విభాగమైన IRCTC జూన్, జులై 2026 నెలల కోసం కొత్త 'భారత్ గౌరవ్' యాత్ర రైలు ప్యాకేజీలను ప్రకటించింది. కేవలం రూ.15 వేల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలతో ఉత్తర, దక్షిణ భారతదేశంతో పాటు నేపాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్లో దర్శించుకోవచ్చు. గతంలో యాత్రలకు వెళ్లేవారు రైలు టికెట్లు, హోటల్స్, భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్ వంటివి విడివిడిగా చూసుకోవాల్సి వచ్చేది. కానీ భారత్ గౌరవ్ స్కీమ్తో ఆ ఇబ్బందులు తీరాయి. ఒక్కసారి ప్యాకేజీ బుక్ చేసుకుంటే చాలు.. రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక ప్రదేశాల సందర్శన, ఇన్సూరెన్స్ అన్నీ ఒకే ప్యాకేజీలో లభిస్తాయి.