translateexpand_more

Cbse Board Exam Controversy News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 12:04 pm
జూన్ 6న భారత్ కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై వివాదాలు రేగుతున్న తరుణంలో, నూతనంగా ఏర్పాటైన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. దేశంలోని విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై దేశంలో శాంతియుత ఆందోళనలు చేపట్టేందుకు తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు స్పష్టం చేశారు. Read also: JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్ ఈ నిరసనలకు సంబంధించిన వివరాలను అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం తాను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల గందరగోళం వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యువత మరియు తమ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా మరియు శాంతియుత మార్గంలో దేశ విద్యార్థుల గొంతుకను ప్రభుత్వం వినేలా చేస్తామని దీప్కే ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి తామంతా నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటామని, అక్కడ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారికంగా అనుమతి కోరతామని ఆయన ఈ వీడియోలో వివరించారు. JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్ Anganwadi Centers: చిన్నారులను నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర

Cbse Board Exam Controversy News Keyword | Telugu Digital