translateexpand_more

Chiranjeevi Tanneeru News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu30 May, 09:47 am
రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం “నేనెవరు?”. చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది. 'సరికొండ మల్లిఖార్జున్' సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథతో, సమాజానికి అవసరమైన సందేశంతో వచ్చిన “నేనెవరు?” చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతలా ఓన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివచ్చి థియేటర్లలో సినిమాను ఆదరించడం తనకు మరింత సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సహా చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

Chitrajyothy30 May, 04:34 pm
నేనెవరు' చిత్రానికి ఆదరణ పెరుగుతోంది

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక చిత్రం 'నేనెవరు'. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendraprasad) ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక చిత్రం 'నేనెవరు' (nenevaru) ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి తెలిపారు. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అనేక కేంద్రాల్లో ఆక్యూపెన్సీ బావుందని వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరణ అందించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని అన్నారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని, సినిమాలోని భావోద్వేగాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.