
‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్లకు ‘పెద్ది’ (Peddi) సినిమా చేశానని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ చిత్రం కోసమే ఇన్నేళ్లూ సమయం తీసుకున్నానని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘పెద్ది’ అంటే అలలా ఎగిసిపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ. ఈ సినిమా సెంకడాఫ్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. రామ్చరణ్ (Ramcharan) ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండానే ఈ సినిమాను ఓకే చేశారు. ఇది కమర్షియల్ చిత్రం కాదు. ఎమోషనల్ డ్రామా’ అని బుచ్చిబాబు వెల్లడించారు. ఈ వీడియో చూశారా: ‘పెద్ది’.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కవుతుంది: జగపతిబాబు
