
ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం వీరత్వం సరిపోదు, అంతులేని ఆయుధ సంపత్తి కూడా అవసరం. ఇరాన్తో జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సంఘర్షణ, అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక చేదు నిజాన్ని ప్రపంచం ముందుంచింది. దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ కవచంగా ఉన్న అమెరికా అమ్ములపొది, నేడు ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్నప్పటికీ, ఆ ఆయుధాలను యుద్ధరంగంలో నిరంతరాయంగా భర్తీ చేసే తయారీ సామర్థ్యం విషయంలో.. అమెరికా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, అమెరికా రక్షణ వ్యూహకర్తలు ఒక పొరపాటు అంచనాకు వచ్చారు. భవిష్యత్తు యుద్ధాలు స్వల్పకాలికంగా, ప్రాంతీయంగానే ఉంటాయని, అందువల్ల భారీ ఆయుధ నిల్వలు అవసరం లేదని భావించారు. ఈ తప్పుడు అంచనానే పెంటగాన్ ఆయుధాల కొనుగోలులో కోత విధించడానికి దారితీసింది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, తాజాగా ఇరాన్తో జరిగిన సంఘర్షణలు - యుద్ధాలు సుదీర్ఘంగా సాగుతాయని, భారీ స్థాయిలో అధునాతన మందుగుండు సామాగ్రి అవసరమనే సంకేతాన్నిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. యుద్ధ నష్టం - గణాంకాలు ఎలాంటివో చూస్తే.. ఈ సంఘర్షణ అమెరికాకు కేవలం భౌగోళిక రాజకీయ సవాలే కాదు, ఆర్థికంగా, సైనికంగా భారీ దెబ్బను మిగిల్చింది. నివేదికల ప్రకారం.. చూస్తే.. మొదట ధ్వంసమైన విమానాల విషయానికి వస్తే, ఎఫ్-35, ఎఫ్-15ఈ, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, కేసీ-135 ట్యాంకర్లు, ఏడబ్ల్యూఏసీఎస్ నిఘా విమానాలతో కలిపి మొత్తం 42 విమానాలు దెబ్బతిన్నాయి. ఇక ఆర్ధిక నష్టం సంగతి చూస్తే. సుమారు 29 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఒక అంచనా. ఆయుధాల కొరత విషయానికి వస్తే.. సమయమే అతిపెద్ద శత్రువుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డబ్బు కాదు,