
శుక్ర వారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినది. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, శుక్ర వారం రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం. శుక్ర వారం లక్ష్మీ వారం. ఈ రోజు ఎవరు అయితే లక్ష్మీదేవిని నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి డబ్బుకు కొదవే ఉండదు అంటారు. అందుకే చాలా మంది శుక్రవారం రోజున చాలా నిష్టగా ఉంటూ, అమ్మవారికి పూజలు చేస్తారు. అయితే ఈ రోజున ఒక పని చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, అసలు ఈ రోజు చేయాల్సిన పని ఏమిటంటే? ఎవరు అయితే శుక్రవారం అమ్మవారిని భక్తిగా పూజించి, ఇండి ప్రధాన ద్వారాంలో ఈ శాన్యం మూలలో నెయ్యి దీపం వెలిగిస్తారో వారికి డబ్బుకు కొదవ ఉండదు. అంతే కాకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా , ఉన్నతంగా ఉంటారంట. ప్రతి శుక్రవారం సాయంత్రం, లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి , తామర పువ్వును సమర్పించాలంట. అంతే కాకుండా, ఆ తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మియి నమ: అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు