translateexpand_more

India News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 04:00 pm
కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, భారత మార్కెట్లోకి 2026 అవెంజర్ 220 స్ట్రీట్ మోడల్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.30 లక్షలుగా నిర్ణయించింది. కొంతకాలం విరామం తర్వాత, నిలిపివేసిన అవెంజర్ 160 స్ట్రీట్ స్థానంలో ఈ కొత్త క్రూయిజర్ బైక్‌ను బజాజ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ఇప్పుడు బజాజ్ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.ఈ బైక్‌లో పల్సర్ 220F, అవెంజర్ 220 క్రూజ్‌లో ఉపయోగించిన 220 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే అమర్చారు. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 19 hp శక్తిని, 7,000 rpm వద్ద 17 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, క్లాసిక్ క్రూయిజర్ లుక్‌ను కొనసాగించారు. ఈ బైక్ ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ రెడ్ వైన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.ఫీచర్ల విషయానికొస్తే, ముందువైపు 280 mm డిస్క్ బ్రేక్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్‌తో పాటు సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను అందించారు. క్రూజ్ వేరియంట్‌లోని స్పోక్ వీల్స్‌కు భిన్నంగా, ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. 737 మిమీ తక్కువ సీట్ హైట్, 160 కిలోల బరువుతో ఇది రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. పట్టణ ప్రయాణాలకు అనుకూలమైన ఈ అర్బన్ క్రూయిజర్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న అవెంజర్ 220 క్రూజ్ సరసన నిలవనుంది.

Oneindia Telugu02 Jun, 12:15 pm
భారత్ కు 114 రఫేల్ యుద్ధ విమానాలు.. చైనా, పాకిస్థాన్ కు కోలుకోలేని షాక్

భారత్ కు సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా ఆయుధాలు సరఫరా చేసిన విషయం తెలిసిందే. కానీ వాటిని భారత్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారత వాయి సేన కోసం రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారిక అభ్యర్థన లేఖ పంపింది.ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 114 విమానాలలో 94 రఫేల్ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఒక భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి భారత్ లోనే అభివృద్ధి చేయనుంది. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమానాలు తయారు చేయడం ఇదే తొలిసారి. ఇందులో దాదాపు 50 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పంపిన ఈ ప్రతిపాదనకు రాబోయే 2 నుండి 3 నెలల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. రాబోయే ఏడాది కాలంలో ఈ చర్చలు ముగిసి ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత వాయు సేన ఎదుర్కొంటున్న యుద్ద విమానాల స్క్వాడ్రన్ల కొరతను తీర్చడానికి ఈ 4.5 జనరేషన్ అధునాతన రఫేల్ విమానాలు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే భారత వాయుసేన, నౌకాదళం కలిపి 62 రఫేల్ విమానాలను ఆర్డర్ చేశాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే 114 రఫేల్ యుద్ధ విమానాలతో కలిపి ఈ సంఖ్య 176 కు చేరుతుంది. అదనంగా భారత నౌకాదళం కూడా మరో 31 రఫేల్ విమానాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే భారత్ మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 200 దాటుతుంది.మరోవైపు జూన్ లో ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో రఫేల్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఇదిలాఉండగా ప్రస్తుతం భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఇక భారత ప్రభుత్వం తాజా నిర్ణయం చైనా, పాకిస్థాన్ లకు షాక్ ఇచ్చిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Oneindia Telugu02 Jun, 11:58 am
భారత్ సాయానికి చేతులెత్తి మొక్కుతున్న ఆఫ్రికా

ఆఫ్రికా ఖండంలో కలకలం రేపుతున్న ఎబోలా మహమ్మారిని కట్టడి చేయడానికి భారతదేశం ముందంజ వేసింది. ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ ప్రత్యేకంగా కోరిన వెంటనే స్పందించిన భారత్, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Africa CDC) సంస్థకు తక్షణ వైద్య సహాయాన్ని అందజేసింది. ఆఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాప్తిని అరికట్టడంతో పాటు, అక్కడి ప్రజారోగ్య సంసిద్ధతను మరింత బలోపేతం చేయడానికి ఈ సాయం ఎంతో కీలకంగా మారుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.ఎబోలా మహమ్మారి తీవ్రతను బట్టి భారతదేశం రెండు విడతల్లో ఈ వైద్య సామాగ్రిని ఆఫ్రికాకు తరలించింది. మొదటగా మే 24వ తేదీన సుమారు 2.5 టన్నుల బరువుగల అత్యవసర వైద్య సామాగ్రిని ఉగాండాలోని కంపాళాకు భారత్ పంపించింది. ఇందులో ఎబోలా రోగుల చికిత్సకు అవసరమయ్యే మందులు, సప్లిమెంట్లు, వైద్యుల రక్షణ పరికరాలు , పర్యవేక్షణ ఉపకరణాలు ఉన్నాయి.ఆ తర్వాత Africa CDC ఇచ్చిన వివరణాత్మక జాబితా ఆధారంగా విదేశాంగ శాఖ ఏకంగా 43 టన్నుల భారీ సరుకును సిద్ధం చేసింది. ఇందులో ప్రత్యేక రక్షణ వస్త్రాలు (PPE కిట్లు), వ్యాధి నిర్ధారణ పరికరాలు, నమూనా (శాంపిల్) కిట్‌లు, అంటువ్యాధి నివారణ సామాగ్రితో పాటు కీలకమైన మందులను పంపింది. ఈ భారీ సరుకు 2026 జూన్ 2వ తేదీన కంపాళాకు చేరుకుని, అక్కడ Africa CDC అధికారులకు అధికారికంగా అందజేయబడుతుంది.తూర్పు కాంగోకు చేరనున్న సాయం.. Africa CDC ధన్యవాదాలు!డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతాలలో ఎబోలా ప్రతిస్పందన కోసం భారత ప్రభుత్వం అందించిన ఈ అత్యవసర వైద్య సామాగ్రిని Africa CDC సంస్థ సోమవారం మనస్ఫూర్తిగా స్వాగతించింది. భారతదేశం పంపిన సరుకులు Africa CDC యొక్క తూర్పు ప్రాంతీయ సమన్వయ కేంద్రం ద్వారా ఉగాండాకు చేరుకున్నాయి. ఇవి తూర్పు కాంగో (DRC)లో ఎబోలా నియంత్రణ ప్రయత్నాలకు ఎంతగానో మద్దతుగా నిలుస్తాయి అని ఆ సంస్థ X (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్‌లో ప్రత్యేకంగా పేర్కొంది.మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!ఈ క్లిష్ట సమయంలో ఆఫ్రికా దేశాలకు సంఘీభావం ప్రకటించిన భారత ప్రభుత్వానికి, ఇక్కడి ప్రజలకు తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆ ప్రజారోగ్య సంస్థ కొనియాడింది. ఈ వైద్య సహాయం వల్ల ఎబోలా వ్యాప్తి కట్టడిలోకి రావడమే కాకుండా, వైరస్ బారిన పడిన ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.ఆఫ్రికా దేశాలతో చెడనవని బంధం!ఆఫ్రికా ఖండం అంతటా వ్యాధుల నివారణ, అత్యవసర వైద్య ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ఆఫ్రికన్ యూనియన్ ప్రజారోగ్య సంస్థ (Africa CDC) కీలక పాత్ర పోషిస్తోంది. కష్టకాలంలో ఆఫ్రికా దేశాలకు అండగా నిలవడం, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడం ఆఫ్రికా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన భాగస్వామ్య నిబద్ధతను ప్రతిబింబిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?ప్రస్తుతం అడిస్ అబాబా, కంపాళాలోని భారత మిషన్లు (రాయబార కార్యాలయాలు) ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ , Africa CDC సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆఫ్రికా ఆరోగ్య అధికారులతో న్యూఢిల్లీ నిరంతర పరిచయంలో ఉందని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని వైద్య సేవలు, లాజిస్టికల్ సహాయం అందించడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది.