
హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ కారిడార్లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రెండు విడతల వేలాల ద్వారా టీజీఐఐసీకి దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్: రాయదుర్గం ఐటీ కారిడార్లో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల ధర పలికింది. దీంతో ఐటీ కారిడార్లో భూములకు ఉన్న భారీ డిమాండ్ మరోసారి స్పష్టమైంది. తాజాగా టీజీఐఐసీ 5.09 ఎకరాల భూమిని వేలానికి పెట్టగా, ఈ వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఐటీ, వాణిజ్య రంగాల విస్తరణతో ఈ ప్రాంతంలో భూముల విలువలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, కేవలం రెండు రోజుల క్రితమే నిర్వహించిన మరో భూముల వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది. ఆ వేలం ద్వారా టీజీఐఐసీకి రూ.1,490 కోట్ల ఆదాయం లభించింది. తాజా వేలం, గత వేలం కలిపి రెండు విడతల్లో టీజీఐఐసీకి దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. రాయదుర్గం ఐటీ కారిడార్లో భూముల కోసం పెట్టుబడిదారులు, సంస్థలు తీవ్ర పోటీ పడుతుండటంతో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి