translateexpand_more

Law And Order News

Latest updates from Telugu Digital news sources.

AP7AM30 May, 11:28 am
బాల్క సుమన్ పై పీడీ యాక్ట్ పెట్టాలి

సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్క సుమన్ అరెస్ట్ కావడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని, దీని వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర దాగి ఉందని వెంకట్ ఆరోపించారు. "మీకు కోపం ఉంటే మాపై దాడి చేయండి, కానీ సామాన్య పేద ప్రజలు ప్రయాణించే రైళ్లపై మీకెందుకు అంత అక్కసు? మీకు ఓట్లేయలేదనే కక్షతోనే పేదలపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ఒక్కొక్కరికి ఒక్కో వివాదాస్పద బాధ్యత అప్పగించారని.. సుమన్‌కు రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని, సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.

Andhra Jyothy01 Jun, 01:43 pm
స్నేహం పేరు చెప్పి తప్పించుకోలేరు.. టీనేజర్ హత్యపై యూపీ సీఎం వ్యాఖ్య

<p>ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఇటీవల కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బిజ్నోర్‌లో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్టేనని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.</p><p>అహింస, మానవత్వం సమాజాన్ని సుసంపన్నం చేసే ఆభరణాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగినప్పుడు దీటుగా స్పందించక తప్పదని కూడా చెప్పారు. ఖరదూషనాదులు వంటి రాక్షస శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఆయుధాల చేతపట్టకతప్పదని చెప్పారు. దేశంలోని వారందరూ చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>బక్రీద్ రోజున సూర్య (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలనూ చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cm-vijay-says-i-am-a-public-servant-not-a-chief-minister-hits-back-at-critics-erk-1528762.html"><strong>నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/india-us-trade-deal-phase-one-nearing-completion-says-piyush-goyal-pcs-1528756.html"><strong>యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్</strong></a></p>

AP7AM30 May, 01:06 pm
దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో నిర్వహించిన ‘నౌసేన శౌర్య వాటిక’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ... అహింస మానవాళికి పరమ ధర్మమే అయినప్పటికీ, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారినప్పుడు కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే బలప్రయోగం లేదా ‘ధర్మ హింస’ చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. బలహీనులను ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహాన్ని కోరుకుంటాయని యోగి పేర్కొన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ.. 2017కు ముందు యూపీలో మాఫియా ఆధిపత్యం, నేరాలు ఎక్కువగా ఉండేవని, బీజేపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా మెరుగయ్యాయని గుర్తుచేశారు. దేశ సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశాన్ని కాపాడుతున్న సైనికుల త్యాగాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.