translateexpand_more

Lokamata News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne01 Jun, 12:26 pm
భారతీయ క్షేత్రాల జీర్ణోద్ధరణకు మారుపేరు.. లోకమాత అహల్యాబాయి హోల్కర్

భారత చరిత్రలో ఎందరో రాజులు, రాణులు రాజ్య విస్తరణ కోసమో.. శౌర్యాన్ని ప్రదర్శనకో యుద్ధాలు చేశారు. కానీ.. పరాయి పాలకుల అరాచకాలకు బలైన హైందవ సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడటమే ధ్యేయంగా జీవించిన వారు చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన, అద్భుతమైన పాలకురాలిగా మాల్వా సామ్రాజ్య రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆమె కేవలం ఒక రాజ్యానికి పరిమితమైన పాలకురాలిగా కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న వందలాది పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించి, యావత్ భారత ప్రజల గుండెల్లో లోకమాతగా అచంచలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దాడులకు గురై వెలవెలబోయిన కాశీ, సోమనాథ్ వంటి మహా క్షేత్రాలకు పూర్వ వైభవాన్ని తెచ్చి, భారత సాంస్కృతిక పునాదులను ఆమె ఎలా బలోపేతం చేశారో వివరించే సమగ్ర కథనం ఇది. మహారాష్ట్రలోని ఒక సాధారణ గ్రామంలో జన్మించిన అహల్యాబాయి, మాల్వా సామ్రాజ్య పీఠాన్ని అధిరోహించడం వెనుక ఒక గొప్ప చారిత్రక ప్రయాణం ఉంది. ప్రస్తుత అహిల్యానగర్ జిల్లాలోని చోండి గ్రామంలో పటేల్ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే విద్యాబుద్ధులు, ధార్మిక విషయాలపై అమితమైన ఆసక్తి ఉండేది. నాటి రోజుల్లో బాలికలకు చదువు అరుదైన విషయమే అయినప్పటికీ, ఆమె తండ్రి ప్రోత్సాహంతో అక్షరాస్యత సాధించారు. మరాఠా సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సర్దార్ మల్హార్‌రావు హోల్కర్ ఒకసారి ఈమె భక్తి శ్రద్ధలను గమనించి, తన కుమారుడైన ఖాందేరావు హోల్కర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ వివాహ బంధమే ఆమెను రాజకుటుంబంలోకి నడిపించి, తదుపరి కాలంలో ఒక గొప్ప పాలకురాలిగా ఎదగడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఆమె జీవితం సుఖసంతోషాలతో సాఫీగా సాగలేదు. విధి ఆమెను అనేక పరీక్షలకు గురిచేసింది. కుమ్హేర్ యుద్ధంలో భర్త మరణించడంతో ఆమె తీవ్ర మానసిక