
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై కల్వకుర్తి మండలం తాండ్రా గేట్ సమీపంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను బాలు, ప్రవీణ్గా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో, అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.