translateexpand_more

Nats News

Latest updates from Telugu Digital news sources.

Eenadu30 May, 03:18 pm
నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. మురళీమోహన్, నోరి దత్తాత్రేయుడులకు సత్కారం

వాషింగ్టన్‌: తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. అమెరికాలో సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నేతృత్వంలో ఫోర్డ్స్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఇటీవల పద్మ పురస్కారాలు పొందిన నటుడు మురళీమోహన్, ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడులను నాట్స్ నేతలు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. సమాజానికి, తెలుగు జాతికి వారు చేసిన సేవలను కొనియాడారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని మురళీమోహన్ అన్నారు. తెలుగు మూలాలను ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలని సూచించారు. క్యాన్సర్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డా.నోరి దత్తాత్రేయుడు వివరించారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రవాసంలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చి.. మన సంస్కృతిని కాపాడుకోవడానికి నాట్స్ నిరంతరం కృషి చేస్తుందని ఛైర్మన్ కిశోర్ కంచర్ల అన్నారు. అమెరికాలో తెలుగువారి మేలు కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ 2.0 ద్వారా నేటి తరానికి.. భావితరానికి ఓ వారధి నిర్మించామని, తెలుగు సంస్కృతిని తరతరాల పాటు నిలబెట్టేలా నాట్స్ కృషి చేస్తోందని మాజీ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, సామ్ మద్దాలి, అరుణ గంటిలను సన్మానించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల

Telugu Times01 Jun, 06:25 am
ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళం

సోమర్సెట్ ల్, న్యూ జెర్సీ మే 31: పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న ‘ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా 10,000 భారీ విరాళాన్ని అందిచింది. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సేవా, సాంస్కృతిక కార్యక్రమంలో నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ నాయకుల బృందం కలిసి ఈ విరాళానికి సంబంధించిన మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారికంగా ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్యామ్ మద్దాళికి అందించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు శేఖరం కొత్త, శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీధర్ అప్పసాని, ప్రశాంత్ పిన్నమనేని, గంగాధర్ దేసు, బాపు నూతి, రాజ్ అల్లాడ, హరి బుంగటావుల, టిపి రావు, బిందు యలమంచిలి, శ్యామ్ నాళం, శ్రీనివాస్ భీమినేని, కిరణ్ మందడి, వంశీ కొప్పురావూరి తదితరులు పాల్గొన్నారు. ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా చేస్తున్న సేవలను నాట్స్ నాయకులు అభినందించారు. ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వి.కె. రాజు, ప్రెసిడెంట్ లీలీ వి. రాజు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్యామ్ మద్దాళి, శేఖర్ వెంపరాల, శ్రీను మద్దులలు అంధత్వ నివారణకు చేస్తున్న కృషిని నాట్స్ నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. పిల్లల కళ్లల్లో కాంతిని నింపే ఇలాంటి మహత్కార్యాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎలాంటి లాభాపేక్ష లేని ఇలాంటి ఉచిత వైద్య సేవలను భారతదేశంలోని కంటి సమస్యలున్న పేదలందరికీ చేరేలా ప్రచారం చేయాలని నాట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజమండ్రిలో $20 మిలియన్లతో సరికొత్త క్యాంపస్: డాక్టర్ వి.కె. రాజు నేతృత్వంలోని గౌతమి ఐ