translateexpand_more

Negative News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 03:17 pm
చేతబడి నెపంతో యువకుడి హత్య.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడిని మూఢనమ్మకాల కారణంగా కొందరు గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి, 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు BNS చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూఢనమ్మకాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర నేరమని ఏఎస్పీ మనీషా రెడ్డి హెచ్చరించారు.

AP7AM02 Jun, 05:08 am
సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో వివాదం తలెత్తింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ నివేదిక కోరింది. ఈ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Eenadu02 Jun, 01:59 am
అమెరికాలో కాల్పులు.. ఏడుగురు మృతి

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా (USA)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్‌ పోలీసులు తెలిపారు. 210 పార్క్‌ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, వైద్యసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్‌కు చెందిన ర్యాన్‌ విల్లీస్‌ (52)ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే అతడు అక్కడినుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో విల్లీస్‌ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక, మస్కటీన్‌లోని ఓ నివాసంలో, గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒక కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Negative News Keyword | Telugu Digital