translateexpand_more

Education News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 12:27 am
బాగా చదువుకో.. అండగా ఉంటా భవితకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం

పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి.... హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. ఉన్నత చదువులకు అవసరమైన స్కూల్‌ సర్టిఫికెట్లకు ఇవ్వాల్సిన రూ.60 వేల ఫీజును చెల్లించడంతో పాటు.. విద్యార్థిని తక్షణ ఖర్చుల కోసం మరో రూ.20 వేలను అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన మంత్రి.. బాగా చదువుకోవాలని భవితకు సూచించారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి పాసై స్కూల్‌ టాపర్‌గా నిలిచిన భవితకు స్కూల్‌ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో.. అదే విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టును చూసిన మంత్రి వెంకటరెడ్డి వెంటనే తన సిబ్బందికి విషయం చెప్పి విద్యార్థిని భవితను బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడడంతో పాటు స్కూలు ఫీజు చెల్లించారు.

AP7AM02 Jun, 05:08 am
సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో వివాదం తలెత్తింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ నివేదిక కోరింది. ఈ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

AP7AM31 May, 04:37 pm
తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే

రాష్ట్రంలో తీవ్రమైన వడగాలుపుల కారణంగా తెలంగాణలోని యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్య తరగతులు మొదలవుతాయి.ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని క్యాంపస్, అనుబంధ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు సెలవులను జూన్ 6 వరకు పొడిగించగా, జూన్ 7 ఆదివారం కావడంతో జూన్ 8న కాలేజీలు తెరుచుకుంటాయి. మరోవైపు, కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు ప్రకటించి, జూన్ 6న తరగతులు ప్రారంభించనున్నాయి.రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వేసవి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. అయితే, ఈ సెలవులు విద్యార్థులు, టీచింగ్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయి. ప్రిన్సిపాల్స్, పరిపాలన బాధ్యతల్లో ఉన్న సిబ్బంది యధావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. అధ్యాపక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు వడగాలుపుల హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, ఈ అదనపు సెలవులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిస్తున్నాయి.