translateexpand_more

Degree Colleges News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu31 May, 01:08 pm
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..వేసవి సెలవులు మరో వారం పొడిగింపు..విద్యాసంస్థలు పునఃప్రారంభం అప్పుడే

Telangana Summer Holidays: తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడుగా వడగాలులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచే విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సింది. కానీ, ఎండలతో పాటు వడగాలుల తీవ్రత తగ్గకపోవడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ సాంప్రదాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని క్యాంపస్, కాన్‌స్టిట్యుయెంట్ (అనుబంధ), అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు.. ఈ మూడు విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు జూన్ 6 వరకు సెలవులను పొడిగించారు. ఈ కాలేజీలు తిరిగి జూన్ 8 (సోమవారం) నాడు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు జూన్ 5 వరకు వేసవి సెలవులను పొడిగించారు. ఇవి తిరిగి జూన్ 6 నుంచే ఓపెన్ కానున్నాయి. విద్యార్థులకు, సాధారణ అధ్యాపకులకు సెలవులు పొడిగించినప్పటికీ.. కాలేజీల ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలలోని ఉన్నతాధికారులు మాత్రం యధావిధిగా విధులకు హాజరుకావాలని యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం.. డిగ్రీ కాలేజీలకు ఏటా 10 వారాల పాటు వేసవి సెలవులు ఇచ్చేందుకు అర్హత ఉంటుందని కొలీజియట్ ఎడ్యుకేషన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కాదరు సురేందర్ రెడ్డి తెలిపారు. మొదట మే 1 నుంచి మే

AP7AM31 May, 04:37 pm
తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే

రాష్ట్రంలో తీవ్రమైన వడగాలుపుల కారణంగా తెలంగాణలోని యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్య తరగతులు మొదలవుతాయి.ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని క్యాంపస్, అనుబంధ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు సెలవులను జూన్ 6 వరకు పొడిగించగా, జూన్ 7 ఆదివారం కావడంతో జూన్ 8న కాలేజీలు తెరుచుకుంటాయి. మరోవైపు, కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు ప్రకటించి, జూన్ 6న తరగతులు ప్రారంభించనున్నాయి.రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వేసవి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. అయితే, ఈ సెలవులు విద్యార్థులు, టీచింగ్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయి. ప్రిన్సిపాల్స్, పరిపాలన బాధ్యతల్లో ఉన్న సిబ్బంది యధావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. అధ్యాపక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు వడగాలుపుల హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, ఈ అదనపు సెలవులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిస్తున్నాయి.