
నటుడు రాజా రవీంద్ర తాజా ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రవితేజ కుటుంబంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. రవితేజ అత్తకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన సమయంలో తన భార్యతో కలిసి వారికి అండగా నిలబడినట్లు తెలిపారు. ఈ సంఘటన వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన వివరించారు. హీరోగా నటించిన ఒక చిత్రం విడుదల కాకపోవడం, ఆ తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉండటం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని రాజా రవీంద్ర గుర్తు చేసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ పోషణ కష్టమైందని, అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆ సమయంలో నటుడు సుమన్ను కలవగా, ఆయన సీరియల్స్లో నటించమని సలహా ఇచ్చారని తెలిపారు. సుమన్ ప్రోత్సాహంతో ఒక సీరియల్లో నటించానని, ఆ సీరియల్ చరిత్రలోనే ఆరు పాటలతో, సినిమా తరహాలో భారీగా చిత్రీకరణ జరిగిందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొగల్ గార్డెన్స్ సెట్లో 11 రాత్రులు, 12 జనరేటర్లతో పాట షూట్ చేశారని, టీవీలో అప్పుడు అలాంటి భారీ చిత్రీకరణ అద్భుతమని పేర్కొన్నారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. తన సినీ కెరీర్కు పరుచూరి బ్రదర్స్ ఎంతగానో తోడ్పాటు అందించారని రాజా రవీంద్ర తెలిపారు. వారు తమ సినిమాలలో తన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించారని, రవీంద్ర అనే పేరుతోనే స్క్రిప్ట్లో పాత్రలను రాసేవారని చెప్పారు. వారి మద్దతు వల్లే తాను చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.