
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించ...
Latest updates from Telugu Digital news sources.

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించ...

సాధారణంగా చాలా మంది డబ్బును ఆదా చేయడానికి చిన్న మొత్తాల్లో ఎస్ఐపీ వైపు మొగ్గు చూపుతుంటారు. దీని వల్ల క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటవుతుంది. స్టాక్ మార్కెట్తో పోలిస్తే ఎస్ఐపీల్లో రిస్క్ చాలా తక్కువ. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని మన డబ్బు ఇక్కడ సేఫ్గా పెరుగుతుంది. అయితే, చాలా మంది మైండ్లో ఒక డౌట్ ఉంటుంది. నెలకు కేవలం రూ.2,000 చొప్పున ఎస్ఐపీ చేస్తే, ఎన్ని సంవత్సరాలలో లక్షాధికారి అవ్వొచ్చు? ఆర్థిక నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. మీరు నెలకు రూ.2,000తో మీ ఎస్ఐపీ జర్నీని స్టార్ట్ చేశారనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 12 శాతం రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ లెక్కల ప్రకారం.. మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే, నాలుగో ఏడాది ముగిసే సమయానికి మీ చేతికి ఏకంగా రూ.1,23,670 అందుతాయి. అంటే కేవలం 4 సంవత్సరాలలోనే మీరు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని వెనకేయవచ్చు. ఈ 4 ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు సంబంధించిన పూర్తి గణాంకాలను పరిశీలిస్తే.. మీరు ప్రతి నెలా రూ. 2,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ద్వారా 4 సంవత్సరాల కాలపరిమితిలో మీ మొత్తం పెట్టుబడి రూ. 96,000 అవుతుంది. దీనిపై 12 శాతం అంచనా రిటర్న్ రేట్ ప్రకారం మీకు లభించే లాభం రూ. 27,670 గా ఉంటుంది. అంటే, మీ పెట్టుబడి కాలం ముగిసేసరికి మీకు లభించే మొత్తం రిటర్న్స్ అక్షరాలా రూ. 1,23,670 అన్నమాట. ఈ లెక్కన చూస్తే, కేవలం 4 సంవత్సరాల షార్ట్ టర్మ్లోనే మీరు ఈజీగా లక్షాధికారి కావచ్చు. ఈ లెక్కల ప్రకారం మీ పెట్టుబడి పెంచితే తక్కువ కాలంలోనే కోటీశ్వరులు