translateexpand_more

Stock Market Crash News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 06:57 am
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు

గోల్డ్, సిల్వర్ రేట్లు అనేవి ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది నిపుణులు అంచనా వేస్తారు తప్ప...కచ్చితంగా చెప్పలేరు. పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి...రేపు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చని చెప్తారు. సో కొనుగోలుదారులు కూడా ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకుండా.....అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇవాళ పొద్దుపొద్దున్నే...స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న వార్తలు రావడంతో బుల్ కుదేలైంది. సెన్సెక్స్ ఏకంగా 785 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇవాళ 95. 55 పైసల వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ ఊగిసలాడిన పసిడి, సిల్వర్ ధరలు..కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్నటి నుంచి మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే...ఇవాళ కూడా స్థిరంగానే కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తగ్గిన ధరలు...మళ్లీ అప్పటినుంచి యథావిధిగానే ఉన్నాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,200 వద్ద కొనసాగుతోంది. వెండి మార్కెట్ కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. మంగళవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. కిలో వెండి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా కొంచెం ధరల్లో మార్పులు ఉన్నా...స్థిరంగానే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు ప్రారంభమవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే చమురు ధరలు, నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు బేజారెత్తిపోయారు. ఇప్పుడు మరోసారి యుద్ధమంటే...ఇక పరిస్థితులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించడానికే భయంగా ఉందని మదనపడుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉండటం...భారీ పెరుగుదలకు సంకేతాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

TeluguOne03 Jun, 06:15 am
సెన్సెక్స్ 900, నిఫ్టీ 250 పాయింట్లు పతనం.. అసలు కారణాలివే

భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. దలాల్ స్ట్రీట్‌లో ఎలుగుబంటి పంజా విసరడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు ట్రేడింగ్‌లో బాంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 250 పాయింట్ల మేర భారీగా పతనమైంది. ఈ హఠాత్ పతనంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సంపదకు భారీ గండి పడింది. నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయిలను కోల్పోవడంతో ట్రేడర్లలో ఆందోళన మరింత పెరిగింది. అయితే ఈ అకస్మాత్తు పతనానికి వెనుక కేవలం ఒకే ఒక్క కారణం లేదు, అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో చోటుచేసుకున్న 5 ప్రధాన అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. మార్కెట్ పతనానికి మొదటి మరియు అత్యంత కీలకమైన కారణం దేశంలో వర్షపాతంపై భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదిక. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని, ఇది లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) లో కేవలం 90 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. గత 11 ఏళ్లలో ఇదే అత్యంత బలహీనమైన రుతుపవనాల అంచనా కావడం గమనార్హం. ఎల్ నినో పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోతుందని, ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) విపరీతంగా పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. రెండవది, అంతర్జాతీయంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి. ఇరు దేశాల మధ్య ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ, తుది ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారిక ముద్ర వేయకపోవడం అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై సందిగ్ధత కొనసాగుతుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీనికి తోడు ముడి చమురు (Crude Oil) ధరలు బ్రెంట్ క్రూడ్ బారెల్‌కు 93 డాలర్ల పైనే కొనసాగుతుండటం, భారతదేశం తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడటం వల్ల దేశీయ ద్రవ్యోల్బణ భయాలు ఎక్కువయ్యాయి. మూడవ కారణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీల్లో నెట్ సెల్లర్స్‌గా మారారు. కేవలం మే నెలలోనే వీరు రూ. 55,963 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, జూన్ ప్రారంభంలో కూడా కేవలం ఒకే రోజున రూ. 8,362 కోట్ల మేర భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) కొంతవరకు కొనుగోళ్లు జరిపి మార్కెట్‌ను ఆదుకోవాలని ప్రయత్నించినప్పటికీ, విదేశీ నిధుల వెల్లువలాంటి అమ్మకాల ఒత్తిడిని వారు పూర్తిగా అడ్డుకోలేకపోయారు. నాల్గవది, మార్కెట్ ముగిసే చివరి అరగంటలో జరిగిన MSCI (Morgan Stanley Capital International) ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ. ఈ మే 2026 ఇండెక్స్ మార్పుల కారణంగా ప్యాసివ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేసుకునే క్రమంలో మార్కెట్లో తీవ్రమైన అస్థిరత (Volatility) చోటుచేసుకుంది. తాజా రీబ్యాలెన్సింగ్ ఫలితంగా ఎంఎస్‌సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారతదేశ వెయిటేజీ గతంలో ఉన్న 20 శాతం నుండి దాదాపు 11.2 శాతానికి పడిపోవచ్చనే అంచనాలు మార్కెట్ పతన వేగాన్ని పెంచాయి. ఐదవ కారణం, మార్కెట్ వ్యాల్యుయేషన్లు (Valuations) చాలా ఖరీదుగా మారడం మరియు బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి. గత కొన్ని నెలలుగా భారత మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ప్రీమియం వ్యాల్యుయేషన్లలో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ మరింత పైకి వెళ్లడానికి ఎలాంటి బలమైన పాజిటివ్ ట్రిగ్గర్లు లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపారు. ముఖ్యంగా నిఫ్టీలో దాదాపు 20 శాతం వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు ద్రవ్యోల్బణ భయాలతో భారీగా నష్టపోయి మార్కెట్‌ను కిందకు లాగాయి. ఈ ఐదు కారణాల వల్లే దలాల్ స్ట్రీట్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్కెట్ క్రాష్‌లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40% జంప్! బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!