translateexpand_more

Telangana Politics News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 12:35 am
ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి

<ul><li><p><strong>ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచన.. అందులోభాగమే ఫ్యూచర్‌ సిటీ, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు</strong></p></li><li><p><strong>రెండున్నరేళ్లలో సవాళ్లను అధిగమించి అభివృద్ధిపై నజర్‌</strong></p></li><li><p><strong>సంక్షేమ పథకాల్లోనూ వెనకడుగు లేకుండా అమలు</strong></p></li></ul><p><strong>హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): </strong>ఆరు గ్యారంటీల అమలు దిశగా సుస్థిరమైన అడుగులు.. రైతులకు రుణమాఫీ.. మరో వెయ్యి పెంచి రైతు భరోసా అమలు... 200లోపు యూనిట్లు వాడే వారికి ఉచిత విద్యుత్‌.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్య జాబితాలో చేర్చి నిధుల కేటాయింపు.. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, దీర్ఘ కాలంలో తమదైన ముద్రను చూపించే ఫ్యూచర్‌ సిటీ, మూసీ ప్రక్షాళన.. యువతకు నైపుణ్యాలను నేర్పేందుకు స్కిల్స్‌ యూనివర్సిటీ.. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పును కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూనే.. సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం. 2023ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐతో కలుపుకొని కాంగ్రెస్‌కు వచ్చింది బొటా బొటీ మెజారిటీనే. ఐదారుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలా మొదలైన రేవంత్‌రెడ్డి పాలన.. రెండున్నరేళ్లు గడిచే సరికి సుస్థిర స్థాయికి చేరుకుంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. ఆదాయం సృష్టిస్తేనే పేరొస్తుందని, ఆ దిశగా తాము చేపట్టే కార్యక్రమాలే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. </p><p><strong>హామీలు, ఆపై అప్పుల భారం</strong></p><p>బొటా బొటీ మెజారిటీతో కొలువు దీరిన రేవంత్‌ సర్కారు.. తొలి ఏడాది రాజకీయంగా, ఆర్థికంగా, పాలనా పరంగా సవాళ్లను ఎదుర్కొంది. ఓ వైపున పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండగా.. మరో వైపున రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ 39మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే ఉన్న ఆదాయ.. వ్యయాలకు, ఇచ్చిన హామీలకు లెక్క సరిపోవట్లేదు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఈ అస్థిర పరిస్థితులే కాంగ్రెస్‌ నాయకుల్లో ఐక్యతను తీసుకొచ్చాయి. సీఎం సీటుపైన ఆశను పక్కన పెట్టి... పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ మంత్రాంగమూ పని చేసింది. పదేళ్లపాటు బీఆర్‌ఎ్‌సకు అండగా ఉన్న మజ్లి్‌సను కాంగ్రెస్‌ వైపునకు తిప్పుకోగలిగారు. దీనికితోడు పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మద్దతూ పొందగలిగారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లయిన కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ద్వారా కాగ్రెస్‌ బలం మరింత పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8 సీట్లు గెలుచుకుంటే.. బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్నీ సాధించలేక ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వరుస ఓటములకు తోడు.. కేసీఆర్‌ కూతురు కవిత సొంత పార్టీ పెట్టుకుని బీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి చేస్తుండడం.. అధికార పార్టీకి బలాన్ని చేకూర్చింది. </p><p></p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong>తొలి ఏడాది పాలనపై పట్టుకే సరి! </strong></p><p>రేవంత్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి ఏడాది మొత్తం పాలనా వ్యవస్థపై పట్టు సాధించడానికే సరిపోయింది. అసలే రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక క్రమశిక్షణకు తోడు దుబారా తగ్గింపు, పొదుపుపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రుణాలు మంజూరు చేసిన సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణ వాయిదాల చెల్లింపుల్లో వెసులుబాట్లు సాధించగలిగింది. మలి ఏడాదిలోనూ ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది.అయితే, కొన్ని నెలలుగా అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పరిధి 10లక్షలకు పెంపు,ఇందిరమ్మఇళ్ల మంజూరు, సన్నవడ్లకు రూ.500బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తూనే.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌ మార్కు ఉండే పథకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం.. ప్రజల్లో సానుకూలతను పెంచింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని నిర్ణయించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను రూ.200 కోట్లతో... వంద నియోజకవర్గాల్లో నిర్మిస్తోంది. ఈ స్కూళ్లు భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఆస్తులు కానున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో నైపుణ్యాలు, క్రీడా స్పూర్తిని పెంచేందుకు స్కిల్స్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలనూ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. మరిన్ని పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది.</p><p></p><p></p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>హైదరాబాద్‌ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు</strong></p><p>రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్‌ను మరింత విస్తరించి, అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఒక వైపున జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు,

Vaartha02 Jun, 05:51 pm
తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకం

Byri Shankar Mudiraj: మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని, వారి అమూల్యమైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కొనియాడారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నాటి పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన పాత్ర పోషించిందని గుర్తుచేశారు. నాడు బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా హైదరాబాద్‌కు విచ్చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. అలాగే, పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ నాటి ప్రతిపక్ష నేత, దివంగత సుష్మా స్వరాజ్.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలెవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. “తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి” అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బిల్లు పాస్ చేయించింది బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. Read Also: తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధాన సూత్రాల కోసం తెలంగాణ యువత సుదీర్ఘకాలం ఉధృతమైన పోరాటాలు చేసిందని బైరి శంకర్ అన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ తిరోగమన దిశలో పయనిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమరవీరుల ఆశయాలు నేరవేరాలన్నా, తెలంగాణ తన అసలైన గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పాలన్నా అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘనమైన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు ఉమారెడ్డి, కాసానగొట్టు సంతోష్, గుండ్ల జనార్ధన్, సుతారి కార్తీక్, తాటికొండ శ్రీనివాస్, కెమ్మసారం సంతోష్, సునీల్, కనకరాజు, మహేందర్, యాదగిరి, వెంకట్రాంరెడ్డి, సాగర్ తదితర నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. Vizianagaram Land Acquisition: భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష! Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan : పవన్ కంటే తనకే ఎక్కువ అర్హత ఉందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే !! Pawan – Komati Reddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ Janasena Vs Congress : నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో – పొన్నం కు బొలిశెట్టి కౌంటర్ Pawan Kalyan : ఇది భారతదేశమా? పాకిస్థానా? కాంగ్రెస్ తీరు పై పవన్ ఆగ్రహం Janasena Party :తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ మాజీ అధినేత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ లక్ష్యంగా... తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... ప్రజా గాయకుడు, దివంగత గద్దరన్నతో తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని జనసేన అధినేత పవన్... ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని,... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... ఆర్‌సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ...