
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Weather Alert: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎండా కాలం ముగింపుకు వచ్చింది. ఈ నెల 8న మృగశిర కార్తె ప్రవేశంతో దాదాపు ఎండాకాలం ముగిసినట్టే. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎండలు భారీగా ఉండనున్నాయి. ఈ ఎల్నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరంబీం, ఆసిఫాబాద్,జగిత్యాల, రాజన్న సిల్సిల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, నల్గొండ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వానలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అంతేకాదు ఈ జిల్లాలకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలకు తోడు ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రేపటిలోగా కేరళ తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కాగా నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ జిల్లాలోని తల్లాడలో 6 సెం.మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉదయం ఎండలు మండుతున్నా.. సాయంత్రి పూట వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. మరోవైపు ఎండలు కూడా పలు ప్రాంతాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. నిన్న సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.మొత్తంగా నైరుతి ఋతుపనాలు రాక ఆలస్యంతో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఏపీలో ఈ నెల 6 వరకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. ఎండ తీవ్రత కారణంగా విద్యార్ధులు, పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. Also Read: తెలంగాణకు 12 యేళ్లు పూర్తి.. సుధీర్ఘ పోరాటం - చారిత్రక ఘట్టం.. తెలంగాణ ఉద్యమం .. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి