translateexpand_more

Tirupati Education News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 06:29 pm
తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం

Sai Sudha Play School :తిరుపతి నగరంలోని చిన్నారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ముందస్తు విద్యాభ్యాసాన్ని అందించాలనే సంకల్పంతో సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్’ ఘనంగా ప్రారంభమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల చెంత వెలిసిన ఈ నూతన ఏసీ ప్రాంగణాన్ని సోమవారం అమెరికా (USA) కు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు కలిసి వైభవంగా ప్రారంభించారు. Read Also: Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! యూఎస్‌ఏకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రేఖ రాళ్లపల్లి (MD, USA), రామ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ (USA) అధ్యక్షులు గుడివాడ వెంకట రామనాయుడు, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి (MD, USA)లతో పాటు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, మాస్టర్ అభిషేక్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వారు రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన గావించి క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు రాజకీయ, సామాజిక, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే అత్యుత్తమ విద్యా పునాదులను కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. నగరాలకే పరిమితమైన ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సదుపాయాలు భక్తుల కేంద్రమైన తిరుపతిలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. చిన్నారులలో కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విద్యాసంస్థల అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను కేవలం పరీక్షల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థలు పనిచేయాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించనున్నట్లు వెల్లడించారు. ప్లే స్కూల్ ఇన్‌ఛార్జ్‌లు భార్గవి, రేవతి మాట్లాడుతూ.. చిన్నారుల మేధో వికాసంతో పాటు వారి భావోద్వేగ, సామాజిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు అధునాతన ఏసీ తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, సురక్షితమైన క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రారంభోత్సవం అనంతరం అతిథులు పాఠశాల భవనం, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలాలను పరిశీలించారు. పాఠశాల కల్పించిన మౌలిక వసతులు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను వారు మనసారా అభినందించారు. కార్యక్రమం ముగింపులో అతిథులను యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, పుష్ప భార్గవి, రేవతి, రాజశేఖర్, లక్ష్మి, కళ్యాణి, భువనేశ్వరి, రాధ, భార్గవి, ఆశీఫా, శకుంతల, శారద, సుజిత, మహేశ్వరి, ధనలక్ష్మి, ద్రాక్షాయణి, కిరణ్, మున్వార్ బాషా, వెంకట ముని, బాబు రెడ్డి, రామచంద్ర రెడ్డి, రాజేంద్రప్రసాద్, వివేక్, సురేష్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ TTD Donation:టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు! Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ జూలియానా (జూలీ) తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భవిష్యత్తులో చేపట్టే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలను... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ... యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను